బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: జనసేనాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శనివారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన పవన్ మాట్లాడుతూ.. ఎదిరించే వ్యక్తులు లేకపోతే వైసీపీ దాష్టీకానికి అంతుండదు అని అన్నారు. బెదిరింపులు.. దాడులు.. రక్తపాతం.. ఇదే వైసీపీ ప్రభుత్వ తీరు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే పార్టీ పెట్టా అని వెల్లడించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని దీమా వ్యక్తం చేశారు.