మండల స్థాయి సమావేశం

దెందులూరు నియోజకవర్గం, పెదవేగి మండల స్థాయి జనసేన పార్టీ సమావేశం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి ఆదేశాల మేరకు పెదవేగి మండలం జనసేన పార్టీ నాయకులు పసుపులేటి భార్గవ్ ఆధ్వర్యంలో కవ్వగుంట గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త డా.ఘంటసాల వెంకటలక్ష్మి, దెందులూరు నియోజకవర్గ జనసేన-టిడిపి-బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, జనసేన పార్టీ ఎన్నికల కార్యక్రమాల నిర్వహణ గోదావరి జోన్ కమిటీ కన్వీనర్ రాఘవయ్య చౌదరి, జనసేన పార్టీ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్త నారా శేషు, ఉమ్మడి పశ్చిమగోదావరి జనసేన పార్టీ ఉపధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్ పాల్గొనడం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి ముత్యాల రాజేష్, జనసేన పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు మేడిచర్ల కృష్ణ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు బొడ్డు గిరిబాబు, కల్కి రమేష్, జనసేన మండల సమన్వయ కమిటీ సభ్యులు, వీర మహిళలు, జనసైనికులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.