గిద్దలూరులో ప్రజాగళం

గిద్దలూరు నియోజకవర్గం, బెస్తవారపేట మండలంలో ప్రజాగళం నిర్వహించడం జరిగింది. కొనపల్లే, సింగసానిపల్లె, పోగుల్ల, బార్లకుంట, సింగరపల్లే, బాలేశ్వరపురం, బార్లకుంట, గలిజేరుగుళ్ల, పివి పురం, జెన్నివారి పల్లె, చెన్నుపల్లె, చెరుకుపల్లె, గంటాపురం, బసినేపల్లె, అక్కపల్లే, ఎంపిఫ్ చెరువు, కొత్తపేట గ్రామాల్లో ఎన్.డి.ఏ కూటమి అభ్యర్ధి ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు మట్లాడుతూ కూటమి అభ్యర్ధి ముత్తుముల అశోక్ రెడ్డిని, మాగుంట శ్రీనివాసులురెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు, జిల్లా కార్యదర్శి లంకా నరసింహరావు, మండల అధ్యక్షులు ముంతల మధుసుధన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి దుమ్మని చెన్నయ్య, మాచర్ల వెంకటరెడ్డి, కంభం మండల ప్రధాన కార్యదర్శి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.