సురేష్ నోరు అదుపులో పెట్టుకోకుంటే ఇంటికి వెళ్లి మరీ చీపురులతో కొట్టాల్సి వస్తుంది: తిరుపతి జనసేన

  • చిల్లర తీసుకొని మమ్మల్ని తిట్టమంటే తిట్టావు, రేపు అదే చిల్లర తీసుకొని వైసీపీ నాయకులను తిట్టవా..?
  • కేవలం లక్ష్య అమ్ముడుపోయిన ఒక కుక్క కూడా మా పై మాట్లాడటం హాస్యాస్పదం.
  • మాకు సలహాలు ఇచ్చే ముందు మీ నాయకులకు మీరు మంచి సలహాలు ఇవ్వండి.
  • 2024లో తిరుపతి సీటు “వైసీపీలోని బలిజలకు ఇప్పించగలరా”
  • ప్రెస్ క్లబ్లో అయినా సరే, ప్రజల్లోనైనా సరే చర్చలకు సిద్ధం అంటూ వైసీపీకి సవాల్ విసిరిన జనసేన నాయకులు.

తిరుపతి, జనసేన పార్టీ ద్వారా ఎదిగి కేవలం కబ్జాలు, అవినీతితో తొందరగా ఎదగాలనే లక్షకు అమ్ముడుపోయి, అత్యాశతో వైకాపా తీర్థం పుచ్చుకొన్న పసుపులేటి సురేష్ అనే ఒక పుల్కా నేడు జనసేన నేతలపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఫ్యాన్ పార్టీలోని కొందరు శనివారం జనసేనపై చేసిన వ్యాఖ్యలకు జవాబుగా జనసేన పార్టీ నాయకులు నిప్పులు చెరిగారు. శనివారం ప్రెస్ క్లబ్లో సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పోస్టర్తో సెల్ ఫోన్ షాపు ద్వారా ఎదిగి నేడు తమ జనసేన నాయకులపై అబాండాలను కల్పించుకుని శనివారం ఇదే ప్రెస్ క్లబ్లో ఉదయం ఆరోపణలు చేసిన సురేష్ పై, కొంతమంది వైసిపి నాయకులను ఉద్దేశించి ఆకేపాటి సుభాషినితో కలిసి జనసేన పట్టణ ఉపాధ్యక్షులు బాబ్జి, కార్యదర్శి రాజేష్ ఆచారిలు సవాల్ విసిరారు. వీరు మాట్లాడుతూ వైసిపి పాలనలో తిరుపతి అభివృద్ధి జరగలేదని తాము నిరూపిస్తామని చర్చకు వైసిపి సిద్ధమా అన్నారు. తిరుపతిని శాసించే వైసిపి ప్రధాన నేతలు ఈ పుల్కా గాడి ద్వారా జనసేన పార్టీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ పాలన నుంచి నేటి వైకాపా వరకు బలిజలకు తిరుపతి సీటు ఇవ్వలేదని నిజంగా వైసిపికి బలిజల పై చిత్తశుద్ధి ఉంటే తిరుపతి ఎమ్మెల్యే సీటు ఇప్పుడున్న వారు త్యాగం చేసి 2024 బలిజ వ్యక్తికి ఇప్పించగలరని బలిజ నాయకులను ప్రశ్నించారు. గంజాయి మత్తు పదార్థాలకు తిరుపతి కేంద్రంగా మారిందని, ఎంతోమంది యువత గంజాయికి బానిసలుగా మారుతున్నారని, దీనిపై ఎక్కడైనా ఒక్క కేసు నమోదు కాకపోగా, అవినీతి సంపాదనపై బ్రతుకుతున్నది కొందరు వైసిపి నాయకులని ఆరోపించారు. తిరుపతిలో మీరు ఎక్కడ అభివృద్ధి చేశారో చర్చకు మీరు ప్లేస్ చెప్పిన సరే, మమ్మల్ని చెప్పమన్నా సరే మేము చర్చకు సిద్ధమంటూ జనసేన నాయకులు సవాలు విసిరారు. మా నాయకులు పసుపులేటి హరిప్రసాద్, రాజారెడ్డి, కిరణ్ రాయల్ లు ఎప్పటినుంచో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ని నమ్ముకుని ఉన్నారని నీలా పూటకో పార్టీ మారలేదని, డబ్బుకోసం పార్టీలు మారే నీలాంటి వ్యక్తిత్వం మాకు లేదని ఈసారి మా నాయకులపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఇంటికి వచ్చి మరి చీపురులతో బుద్ధి చెబుతామని జనసేన వీర మహిళలు సురేష్ ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కర్ణం లక్ష్మి, కిరణ్, మనోజ్, కిషోర్, సాయి దేవ్, సుజిత్, తదితరులు పాల్గొన్నారు.