జనసేనలో చేరిన బాపన్న దొర కాలనీ వైసీపీ నాయకులు
- ఉగాది పండుగ సందర్భంగా పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరిన రమణయ్య పేట గ్రామం బాపన్న దొర కాలనీ వైసీపీ నాయకులు
కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో రమణయ్య పేట గ్రామ జనసేన నాయకులు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తాటికాయల వీరబాబు, బాలాజీ, సంతోష్, సునీల్ ల అధ్వర్యంలో ఆ గ్రామంలోని బాపన్న దొర కాలనీకి చెందిన వైసీపీ నాయకులు సుమారు 100 మంది హర్ష, అశోక్, సాయి, దిలీప్, వర్మ, కృష్ణ గార్ల నాయకత్వంలో నేడు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపి & బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ నానాజీ పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-09-at-7.50.50-PM.jpeg)