జనసేనలో చేరిన సూర్యరావు పేట వైసీపీ ముఖ్య నాయకులు

కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సూర్య రావు పేట గ్రామ జనసేన నాయకులు సురాడ అప్పాజీ మరియు దోనే రమణ ల అధ్వర్యంలో వైసీపీ నాయకులు సూరాడ తాత బాబు నాయకత్వంలో సుమారు 30 మంది వైసీపీ ప్రభుత్వంలో వారు ఎదుర్కోలేని సమస్యలుండవని ప్రజలు విసిగిపోయారని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీని ప్రజలు తిప్పి కొడతారనీ వారికి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే సాధారణ పరిపాలన మౌలిక వసతుల కల్పించడంలో విఫలం అయ్యారనీ, జనసేన పార్టీ సిద్దాంతాలు పంతం నానాజీ ఆశయాలు నచ్చి నేడు కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన, టీడీపి & బీజేపీ పార్టీల ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పంతం వెంకటేశ్వర రావు (నానాజీ) సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ నానాజీ పార్టీ కండువాలు కప్పి జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.