అంపిలి గ్రామంలో ఎన్నికల ప్రచారం
- కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణని గెలిపించవలసిందిగా అభ్యర్థన
పాలకొండ నియోజకవర్గం: అంపిలి గ్రామంలో కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి “నిమ్మక జయకృష్ణ” గారిని గెలిపించవలసిందిగా మహాకూటమి నేతలు ఓటర్ మహా మహాశయులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు “గర్భాన సత్తిబాబు”, పాలకొండ మండల పార్టీ అధ్యక్షులు గండి రామనాయుడు బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా నాయకురాలు శ్రీమతి తాడంగి సునీత, టిడిపి నాయకులు శ్రీమతి మోజోరు తేజవతి, జనసేన పాలకొండ మండల పార్టీ అధ్యక్షులు మిడితాన ప్రసాద్, స్థానిక, జనసేన నాయకులు జామి రాంబాబు, తదితర బిజెపి జనసేన టిడిపి నాయకులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-14-at-12.08.13-PM-1-1024x768.jpeg)