వైసీపీ నుండీ జనసేన పార్టీ లోకి భారీ చేరికలు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, అంతర్వేది పల్లిపాలెం గ్రామంలో మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ రాపాక రమేష్ బాబు మరియు మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు అధ్వర్యంలో అగ్నికుల క్షత్రియ సామజిక వర్గానికి చెందిన సుమారు 60 మందికి పైగా వైసీపీ నుండి నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుండుబోగుల పెద్దకాపు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాడి మోహన్ కుమార్, రాష్ట్ర మత్యకార విభాగ కార్యదర్శి పొన్నాల ప్రభ దేశ, ఎంపీపీ మెడిచర్ల సత్యవాణి రాము, పినిశెట్టి బుజ్జి, జిల్లా సంయుక్త కార్యదర్శి గుబ్బల రవి కిరణ్, బొంతు రాజేశ్వర రావు, గొల్లమందల పూర్ణ, ఉండపల్లి అంజి, ఎంపీటీసీ చొప్పాల బాబురావు, బైరా నాగరాజు, మండల అధ్యక్షులు మాల్లిపూడి సత్తిబాబు, దొడ్డా జయరాం, మండల కార్యదర్శి బొమ్మిడి ఏడుకొండలు, మండల ఉపాధ్యక్షులు ఉల్లంపర్తి దర్శనం, కుసుమ నాని, మండల ప్రధాన కార్యదర్శిలు జిల్లెల్ల రక్షక్, నల్ల్లి పవన్ ప్రసాద్, పులి శెట్టి లక్ష్మణ్, దీపాటి మితిన్, ఓగురి మనోహర్, రాలి శ్రీను, వీరమహిళలు అంతర్వేది పల్లవపాలెం జనసైనికులు తదితరులు పాల్గొనడం జరిగింది.