చరిత్రలో నిలిచేలా పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్
- నవశఖానికి వేస్తున్న తొలి అడుగులో ప్రజలంతా పదం కలపాలి
- వైసీపీ క్షుద్ర పాలన అంతమే లక్ష్యం
- జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి
గుంటూరు: గతంలో ఎన్నడూలేని విధంగా నభూతో నభవిష్యత్ అనే రీతిలో చరిత్రలో నిలిచేలా ఎన్డీయే కూటమి బలపరిచిన టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమం జరగనుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తో పాటూ గుంటూరు అసెంబ్లీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గళ్లా మాధవి , తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నసీర్ అహ్మద్ నామినేషన్ వేయనున్న నేపధ్యంలో ప్రజలు తమ నిండైన ఆశీస్సులు అందించాలని ఆయన కోరారు.రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న క్షుద్ర పాలన అంతానికి తొలి అడుగు వేస్తున్న కూటమి అభ్యర్థులకు బాసటగా ప్రతీ ఒక్కరూ నిలవాలని అభిలాషించారు. నవశఖానికి ఆలంబనగా , రాష్ట్ర పునర్నిర్మాణం కోసం జరుగుతున్న మహాసంగ్రామంలో ప్రజలే సైనికులుగా పోరాడాలని కోరారు. రాష్ట్ర ప్రజల కోసం , భావితరాల బంగారు భవిష్యత్ కోసం సమాజ , ప్రజాస్వామ్య సంక్షేమ సారధులంతా ఏకతాటిపైకి రావాల్సిన చారిత్రాత్రక సమయం అసన్నమైందని ఆళ్ళ హరి అన్నారు.