వికర్స్ కాలనీ నుంచి వైయస్సార్ నాయకులు జనసేనలో చేరిక

తాడేపల్లిగూడెం వికర్స్ కాలనీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం జనసేన పార్టీలో చేరారు. బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద మేడపాటి చెల్లారెడ్డి ఆధ్వర్యంలో గంధం సత్తిబాబు, కాసిన శ్రీనివాస్, సోపేటి జానీ, శివ, కృష్ణ లతోపాటు 50 మంది వైఎస్ఆర్సిపి నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైఎస్ఆర్సిపి మొత్తం ఖాళీ అవుతుందని ఆ పార్టీపై ఇటు నాయకులలోను, ప్రజల్లోనూ విశ్వాసం లేదన్నారు. మూడు వంతులు వైసీపీ నాయకులు జనసేనలోకి వచ్చారని మరికొందరు వచ్చేందుకు ఎదురుచూస్తున్నారు అన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలే సాగనంపేందుకు చూస్తున్నారన్నారు. పవన్ బహిరంగ సభకు యువత పెద్ద ఎత్తున తరలి వస్తుందని వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వివరించారు.