పద్మశ్రీ వనజీవి రామయ్యను పరామర్శించిన బాడిశ మురళీకృష్ణ

కృష్ణాజిల్లా, కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తను చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న పద్మశ్రీ వనజీవి రామయ్యను ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ పరామర్శించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద మొక్కలకు నీళ్లు పొసేందుకు రోడ్డు దాటుతుండగా పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ప్రస్తుతం అతను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వనజీవి రామయ్యకు పలు మార్లు ప్రశంసా పత్రాలు కూడా అందజేశారు మరియు రామయ్యకి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాఘవ, నవీన్, సాయి, గోపి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.