తాడేపల్లిగూడెం జనసేన పార్టీలో చేరికలు
తాడేపల్లిగూడెం నియోజకవర్గం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదగా వైసీపీ మాజీ కౌన్సిలర్ పైబోయిన వైదేహి మరియు కర్ణం శ్రీను తేలప్రోలు వారి కుటుంబ సభ్యులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వం పటిమా, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం నచ్చి జగన్మోహనరెడ్డి చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను కూటమి అభ్యర్థులు తిప్పి కొడతారన్నారు. ఈ కార్య క్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-25-at-6.47.27-PM-2-1024x576.jpeg)