వైసిపి నాయకులకు ఓట్లు అడిగే అర్హత లేదు

  • రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట: వైసీపీ నాయకులకు ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదని జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ అన్నారు. శుక్రవారం కడప-చెన్నై రహదారిలోని ఇండేన్ గ్యాస్ వద్ద గల జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం రాజంపేటలో జరిగిన టిడిపి, జనసేన, బిజెపి ప్రజాగళం బహిరంగ సభను జయప్రదం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. వైసిపి పాలనలో ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కోల్పోయారని ఆరోపించారు.ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, హత్యలకు పాల్పడడం వైసిపి నైజంగా మారిందని అన్నారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్న వైసిపి జనంలోకి వెళ్లి ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు జిల్లా కేంద్రంతో పాటు వైద్య కళాశాలను ఇతర ప్రాంతాలకు తరలించి రాజంపేటకు అన్యాయం చేశారని, గతంలో ఆగుతున్న రైళ్లు సైతం వైసీపీ నాయకుల పాలనలో రాజంపేటలో స్టాపింగ్ లేకుండా పోయాయని విమర్శించారు.