చందర్లపాడు మండలంలో ఎన్డీఏ ఉమ్మడి ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి తంబళ్ళపల్లి

నందిగామ నియోజకవర్గం: చందర్లపాడు మండలం, బ్రహ్మ పట్ల పాళ్ళెం, కాండ్రపాడు, కోనాయ పాలెం, గ్రామాల జనసేన పార్టీ ముఖ్య నాయకులతో అలాగే కార్యకర్తలతో జనసైనికులతో, వీరమహిళలతో మరియు టీడీపి నాయకులతో కార్యకర్తలతో కలిసి నందిగామ నియోజకవర్గం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి, అక్కడనుండి నందిగామ మండలంలోని అడవిరాములపాడు గ్రామాన్ని పర్యటించి డోర్ టు డోర్ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. అడవి రావులపాడు లోని జనసేన నాయకులతో జనసేనకులతో ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూడాలని అలాగే గ్రామాల్లో పోల్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యమని, అలాగే ఈవీఎం మిషన్ల గురించి ఈ.వి.ఎంలో ఫస్ట్ కేసినేని శివనాథ్ (చిన్ని) గారిది అలాగే తంగిరాల సౌమ్య గారిది కూడా మొదటి సంఖ్య నెం: 1 మీద ప్రెస్ చేసి గెలిపించాలని ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలని తంబళ్ళపల్లి రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రానున్న ఎన్నికలు చాలా కీలకమైనవి అని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరికీ భవిష్యత్తు రాష్ట్ర అభివృద్ధి యువతకు ఉపాధి ఇలాంటి ఎన్నో అంశాలు ఎన్నికలతో ముడిపడి ఉందని, వైసిపి ప్రభుత్వం హయాంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రజలు అన్ని మర్చిపోకుండా వైసిపి పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని, అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం జరిగేలా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు నందిగామ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, మరియు టిడిపి శ్రేణులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.