ప్రజాసమస్యలపై బత్తుల నేతృత్వంలో పోరుబాట పట్టిన జనసేన

  • నియోజకవర్గంలో ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు పలికే ఒకే ఒకమాట ఈసారి పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా అవకాశం ఇస్తాం
  • నమ్మకం ఉంచండి.. బాధ్యతతో, నిజాయితీగా పారదర్శక పరిపాలన చేసి చూపిస్తాం బత్తుల
  • బత్తుల వెంకటలక్ష్మి కి గ్రామాల్లో పెద్దలు, మహిళల నుండి సంపూర్ణ మద్దతు…
  • మహా పాదయాత్ర సందర్భంగా పలువురి ప్రముఖులతో మంతనాలు.. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానాలు..

రాజానగరం: జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర 64వ రోజు కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం, కోరుకొండ ఫిలింనగర్లో జరిగింది.. కార్యక్రమంలో భాగంగా నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఫిలింనగర్ లో పలువీధుల్లో పర్యటించారు.. ఈ సందర్భంగా కలిసిన వారితో ఈసారి జనసేన పార్టీపై నమ్మకం ఉంచి, అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాలని… నిజాయితీగా పారదర్శకమైన పరిపాలన అంటే ఏంటో జనసేన పార్టీ ద్వారా నిరూపిస్తామని… అందరూ ఈసారి ‘గాజు గ్లాస్’ గుర్తుపై ఓటు వేసి, జనసేన పార్టీని గెలిపించి… ‘పవన్ కళ్యాణ్’ గారిని ముఖ్యమంత్రి చేయాలని పలువురిని అభ్యర్థించడం జరిగింది.. ఈ సందర్భంగా జనసేన పార్టీ విధివిధానాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో కూడిన ‘కరపత్రాలు’ పంచుతూ, ప్రతి గడప ఎక్కుతూ, ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించడం జరిగింది. ఈ క్రమంలో కోరుకొండ గ్రామంలో పలువురు కీలకమైన వ్యక్తులను కలిసి జనసేన పార్టీలోకి చేరాలని ఆహ్వానం పలుకుతూ.. జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెంది, సామాన్యులకు న్యాయం జరుగుతుందని వివరించడం జరిగింది, వారు కూడా త్వరలో పార్టీలో చేరేందుకు పూర్తీ స్థాయిలో సుముఖం వ్యక్తం చేశారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు బదిరెడ్డి దొర, అడ్డాల శ్రీను, తోరాటి శ్రీను, మిరియాల సాయి, బత్తుల గోపాలకృష్ణ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.