రాజానగరంలో జనసేన-తెలుగుదేశం-బిజెపి ప్రచారం

రాజానగరం, రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలంలోని గాదరాడ గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రతీ ఒక్కరినీ పలకరిస్తూ ప్రజా పరిపాలన తీసుకురావడానికి ఆశలకు, ఆకాంక్షలకు వారధి రాజానగరం నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి జనసేన-తెలుగుదేశం-బిజెపి పార్టీలు బలపరచిన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణని అఖండ మెజారిటీతో గెలిపించండి అని అభ్యర్దిస్తూ బ్యాలెట్ నమూనాలో 5 వ నెంబర్ పై ఉన్న గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని బత్తుల వందనాంబిక అభ్యర్దించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం-బిజెపి-జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.