సంకల్ప యాత్రలో పాల్గొన్న బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, వైసిపి రాక్షస పాలన అంతంతోనే రాష్ట్రంలో వెలుగులు తథ్యమవుతుందని అది టిడిపి, జనసేన, బీజేపి కూటమితోనే సాధ్యమని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి ధీమా వ్యక్తం చేశారు. అందుకే పోలింగ్‌ తేదీ అయిన మే 13న ప్రజలంతా ముందుగానే దీపావళి పండుగను జరుపుకునేందుకు సిద్దమయ్యారని స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపి ప్రచారంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఒకపక్క ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ తన గెలుపునకు మార్గం సుగమం చేసుకుంటున్నారు కూటమి ఉమ్మడి అభ్యర్ధి బడేటి చంటి. ఇందులో భాగంగానే ఈరోజు ఏలూరు మెయిన్ మార్కెట్ లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రెడ్డి అప్పల నాయుడు, టిడిపి నాయకులు ఎమ్మార్డీ బలరాం, కొట్టు మనోజ్ తో కలిసి బడేటి చంటి పర్యటించారు. మెయిన్ మార్కెట్లో పర్యటనకు వచ్చిన బడేటి చంటికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ప్రజా విప్లవంతోనే వైసిపి రాక్షస పాలనకు చరమగీతం సాధ్యమవ్వనుందని, రానున్నది కూటమి ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. వైసిపి పాలనతో రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన ప్రతిఒక్కరూ ఎన్నికల సమయంలో తిరిగి వచ్చేందుకు సిద్దమయ్యారంటే ప్రజలు ఎటువంటి స్వేచ్చకావాలనుకుంటున్నారో అర్ధం చేసుకోవాలన్నారు. దీంతో మే 13నే ప్రజలు దీపావళి పండుగను ముందస్తుగా చేసుకొనేందుకు సిద్దమయ్యారని బడేటి చంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులతో పాటు జనసేన పార్టీ జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్‌, లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, నూకల సాయి ప్రసాద్, అల్లు సాయి చరణ్, జనసేన రవి, గొడవర్తి నవీన్, కురెళ్ళ భాస్కర్, బోండా రాము నాయుడు, బుధ్ధా నాగేశ్వరరావు, రావూరి దుర్గామోహన్, కొనికి మహేష్, సాయి రామ్ సింగ్, మేకా సాయి, పవన్, భారీ సంఖ్యలో డివిజన్ ప్రజలు, వివిధ హోదాల్లో ఉన్న వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.