బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి నరసాపురం నియోజకవర్గం మల్లవరం గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు కొయ్యే తాతాజీ, కొయ్యె చందు, గోడి సజీవ్, ఆకుమర్తి జోసఫ్ రాజు, తాడి రాంబాబు, సాయి, సంతోష్ మరియు వారి అనుచరులు దాదాపుగా 30 మంది టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ సమక్షంలో వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువా కప్పి నాయకర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.