బి. పప్పూరు గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ఎన్నికల ప్రచారం

సింగనమల నియోజకవర్గం: నార్పల మండలం, బి. పప్పూరు గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమిల అనంతపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ ప్రచార కార్యక్రమం జరిగింది. వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజా పాలనకు నాంది పలకాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, నియోజకవర్గ ఇన్చార్జ్ సాకే మురళీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు అమిలినేని సత్తి, గుత్తా నాయుడు, సుధాకర్, సంజీవ రాయుడు, నరసన్న, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్ప చంద్రశేఖర్, మూలీ శ్రీకాంత్ రెడ్డి, నార్పల మండల అధ్యక్షులు రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ సభ్యులు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.