షర్మిల దీక్షను భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఇందిరాపార్కు వద్ద ఆమె దీక్ష చేపట్టారు. అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని.. దీక్ష విరమించాలని పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమెను అక్కడి నుంచి బలవంతంగా తరలించారు. తాను 72 గంటల దీక్షకు పూనుకున్నానని.. ఎక్కడికి తరలించినా పాదయాత్రగా వచ్చి మళ్లీ కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు.