ఐపీఎల్‌ 2021: టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

ఐపిఎల్ 2021లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఢీకొనబోతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు కెప్పెటన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకుని, ముందుగా బెంగళూరును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. గత మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై గెలిచిన ఢిల్లీ.. ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తోంది. మరోవైపు చెన్నై చేతిలో ఘోరంగా పరాజయం పాలైన బెంగళూరు ఈ మ్యాచ్లో గెలుపొంది సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.