అమెరికా ప్రజలకు ఊరట.. ఇకపై మాస్క్ లేకుండా తిరగొచ్చు

కరోనా ఫస్ట్ వేవ్‌లో అల్లాడిన అమెరికా ప్రస్తుతం కోలుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అమెరికా ఇప్పుడిప్పుడే కోలుకుంటుందోని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది. ఇప్పటి వరకు యూఎస్‌లో పూర్తి స్థాయిలో కరోనా బాధితులకు వ్యాక్సిన్ అందించడం జరిగిందన్నారు. టీకాలు వేసుకున్న వ్యక్తులు ఇప్పుడు ముసుగు ధరించకుండా బయటకు తిరగవచ్చని పేర్కొంది. అయితే బయటకు వెళ్లినప్పుడు 6-8 అడుగుల దూరంలో నిలబడి కార్యకలాపాలు నిర్వర్తించుకోవాలన్నారు. అమెరికాలో పెద్ద ఎత్తున టీకాలు వేసే కార్యక్రమం జరిగింది. దాదాపు అన్ని కేటగిరి ప్రజలకు టీకాలు వేయడం పూర్తయింది.