అమెరికాకు ప్రధాని మోదీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు, ఆ దేశ ప్రజలకు ప్రధాని మోదీ 245వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. గొప్ప ప్రజాస్వామ్య దేశాలుగా భారత్‌, అమెరికా స్వేచ్ఛాస్వాతంత్ర్య విలువలను కాపాడుకుంటూ వస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. మన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నదని ఆయన తెలిపారు