కలవరపెడుతున్న కోవిడ్ వ్యాప్తి

ప్రపంచవ్యాప్తంగా గత వారం కొవిడ్‌ మరణాలు 21 శాతం పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మహమ్మారి కారణంగా 69 వేల మరణాలు నమోదయ్యాయని,  ఇందులో అత్యధికంగా ఆగ్నేయాసియా, అమెరికా దేశాల నుంచే ఉన్నట్లు తెలిపింది.

అత్యధిక సంఖ్యలో కేసులు అమెరికా, బ్రెజిల్‌, ఇండొనేసియా, బ్రిటన్‌, భారత్‌లలోనే నమోదైనట్లు పేర్కొంది.

మన దేశంలో కొవిడ్‌ రోజువారీ కేసుల సంఖ్య బుధవారం భారీగా పెరిగింది. మరణాల్లోనూ పెరుగుదల నమోదైంది. క్రితం రోజు 30 వేలకు దిగువన రోజువారీ కేసులు నమోదు కాగా బుధవారం ఏకంగా 43 వేలు దాటాయి. గత 24 గంటల్లో 43,654 కొత్త కేసులు బయటపడగా.. 640 మంది కొవిడ్‌తో మృతిచెందారు.