ఐపిఎల్ 2020 కొత్త లోగో

ఐపీఎల్ 2020 లోగో మారింది. పాత స్పాన్సర్స్ వివో స్థానంలో ప్రముఖ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 వచ్చి చేరడంతో పాత లోగో స్థానంలో కొత్త లోగో వచ్చి చేరింది. భారత్ – చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వీవో కూడా చైనాకు చెందిన సంస్థ అనే కారణంతో వివోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవడంతో ఐపీఎల్‌ 2020 నిర్వాహకులకు స్పాన్సర్‌ని మార్చక తప్పలేదు. ఈ క్రమంలో ఐపీఎల్‌తో డ్రీమ్ 11 సంస్థ పేరును చేర్చి సరికొత్త లోగోను రూపొందించి తాజాగా ఆ లోగోను విడుదల చేశారు. ఐపిఎల్ కొత్త లోగో విడుదలైన నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు డ్రీమ్ 11 కి కంగ్రాట్స్ చెబుతూ ఆ లోగోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ డీల్ కోసం డ్రీమ్ 11 రూ.222 కోట్లు బిడ్ చేసి ఈ స్పాన్సర్‌షిప్‌ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టాటా సన్స్, అన్‌అకాడమి, బైజూస్ వంటి కార్పొరేట్ దిగ్గజాలతో డ్రీమ్ 11 పోటీపడాల్సి వచ్చింది.