ఆసక్తిరేపుతున్న ‘కొండ పొలం’ ట్రైలర్

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా ‘కొండ పొలం’ సినిమా తెరకెక్కింది. ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ కాక ముందే ఈ సినిమాని రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజయింది. ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న రెండో చిత్రం ‘కొండ పొలం’. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ ఫా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 8న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ట్రైలర్ లో క్రిష్ మార్క్ సుస్పష్టంగా కనిపిస్తోంది. పూర్తి అడవి నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ డ్రామాలో గొర్రెల కాపరుల కుటుంబం నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ బాగా చదువుకుని మంచి స్థాయికి వెళ్లే యువకుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలమై మళ్ళీ గొర్రెలు కాస్తూ కుటుంబంతో కలిసి కొండపాలం వెళ్లిన యువకుడిగా వైష్ణవ్ ఆకట్టుకున్నారు. గొర్రెల కాపరిగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తో వైష్ణవ్ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అడవిలో యాక్షన్ పరంగా ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలు కూడా సినిమాని ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సాయిబాబు – రాజీవ్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ .. రకుల్ ఇద్దరూ కూడా చాలా తక్కువ మేకప్ తో కొత్తగా కనిపిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి మరి.