పవన్ కళ్యాణ్ పై మంత్రి స్పందనకి మామిడికుదురు జనసైనికుల స్పందన

తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం జనసేన నాయకులు అడబాల తాతకాపు మాట్లాడుతూ,
ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151 మంత్రులను ఎన్నుకున్నది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి గాని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టడానికి కాదు.

గుమ్మడి కాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు ఒక దొంగ బయటకు వస్తాడు అనుకుంటే చాలామంది దొంగలు ఇప్పుడు బయట పడుతున్నారు… దీనికి కారణం రిపబ్లిక్ సినిమా ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ఒక మంత్రిని ఉద్దేశించి అన్న మాటకి చాలా మంది మంత్రులు బయట పడుతున్నారు.
అధికార పార్టీలో ఉండి ప్రజలకు ఏం చేయాలో ప్రజలకు ఏం చేస్తే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటారు అనేది ఆలోచించకుండా, కట్టగట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిని అన్న దానికి వైసీపీ వాళ్ళు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం భావ్యం కాదు.

‘కోపం నామీద ఉంటే నా సినిమా ఆపాలి తప్ప , ఇండస్ట్రీలో మిగతా సినిమాలని ఇబ్బంది పెట్టకూడదు’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సమాధానం చెప్పలేని వైసీపీ నేతలు సన్నాసి అన్న పదాన్ని పట్టుకొని అందరూ బయటికి రావడం తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి గానీ, రాష్ట్ర ప్రజల గురించి గానీ ఏమాత్రం పట్టించుకోకపోవటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.