విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన నిడదవోలు జనసేన నాయకులు

జనసేన అధినేత శ్రీ పవన్ కల్యాణ్ పాడైపోయిన రోడ్లను శ్రమదానం చేయాలని ఇచ్చిన పిలుపు మేరకు నిడదవోలు నియోజకవర్గము నిడదవోలు మండలంలో అస్తవ్యస్తంగా వున్న ఉనకరమిల్ల్లి, కాటకోటేశ్వరం గ్రామాల్లో గల ఆర్& బీ రోడ్డును జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి , శెట్టిబలిజ సంఘం నాయకులు పాలా వీరాస్వామి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తల సహకారంతో ప్రమాదాలకు కారణమవుతున్న గోతులను పూడ్చారు. రోడ్లు వేయటం ప్రభుత్వ బాధ్యత, రోడ్ టాక్స్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పేద, ధనిక అనే తేడా లేకుండా కడుతున్నారు. కానీ ఈ రెండున్నర సంవత్సరాలలో రోడ్లుని నిర్లక్ష్యం చేసి ఎన్నో కుటుంబాలు ప్రమాదాలకు గురయ్యేలా చేశారు. ఇప్పటికి అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర నుండి మేల్కొని రోడ్లను వేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కనీసం ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు జనసేన శ్రేణులు వారి కష్టార్జితంతో గుంటలు పూడుస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గం జనసేన నాయకులు , కార్యకర్తలు, ప్రజలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.