ఉప్పలగుప్తం మండల జనసేన MPTC లకు సన్మానం

ఉప్పలగుప్తం మండలం జనసేన పార్టీ నాయకులు ఆకుల బుజ్జి ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన జనసేన పార్టీ ఎంపిటిసిలకు సోమవారం సన్మానం చేయడం జరిగింది. దోనిపాటి బాలమ్మ, నాగులపల్లి శేషవేణి, తాళ్ళ లక్ష్మినరసాయమ్మలను జనసేన అమలాపురం నియోజకవర్గ ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, మండల అద్యక్షుడు సూర్యనారాయణమూర్తి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాకపల్లి ఈశ్వరి సత్యనారాయాణ, మహాదశ నాగేశ్వరరావు, నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.