ఏవోబీలో ఎదురుకాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఎదురుకాల్పులు జరిగాయి. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా తులసీపహాడ్ ప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.