Amalapuram: ‘మార్పు’ జనసేనలో చేరిన వైసీపీ మరియు టీడీపీకి చెందిన దళిత నాయకులు మరియు దళిత యువత

జనసేన పార్టీ ఆశయాలతో ముందుకు వెళ్తు, ఓటమి భయం అనేది లేక, ఫలితం ఎలా ఉంటుందనే భయం లేకుండా ప్రజల సమస్యలు ఎలా తీర్చాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలో దళితులు జనసేన పార్టీ భావజాలంకి ఆకర్షితులై దళితులు భారీగా పార్టీలోకి చేరడం జరిగింది. జనసేన పార్టీ అద్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి ఈరోజు అమలాపురం నియోజకవర్గం లోని సుమారు 100 మంది పైగా వైసీపీ మరియు టీడీపీకి చెందిన దళిత నాయకులు దళిత యువత అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది