Vizag: షిప్పింగ్ హార్బర్ లో జనసేన మత్స్యకార వికాస విభాగం పర్యటన
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని, ఓటు వేసిన పాపానికి నానా కష్టాలు పడుతున్నామని విశాఖ తీర ప్రాంతం వెంబడి మత్స్యకారులు వాపోతున్నారని జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం చైర్మన్ శ్రీ బొమ్మడి నాయకర్ స్పష్టం చేశారు. అదే సమయంలో జనసేన పార్టీపై ఆదరణ పెరుగుతోందని చెప్పారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల పర్యటనలో భాగంగా మత్స్యకార వికాస విభాగం నాయకులు విశాఖ ఫిషింగ్ హార్బర్, గంగవరం పోర్టు ఏరియాల్లో పర్యటించారు. మత్స్య సంపదపై ఆధారపడిన చిరు వ్యాపారులను కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. బోటు ఓనర్స్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గంగవరం ఫిషింగ్ హార్బర్ నిలిపివేత కారణంగా ఎంతోమంది జీవనోపాధి కోల్పోయిన విషయాన్ని జనసేన నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ విధానాల పట్ల మత్య్సకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక నివేదిక రూపొందించి శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని శ్రీ బొమ్మిడి నాయకర్ హామీ ఇచ్చారు. మత్స్యకార సోదరులంతా జనసేన పార్టీకి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీ కంబాల దాసుబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, శ్రీ పల్లేటి బాపనదొర, శ్రీ బి.కుమార్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-26-at-2.33.13-PM.jpeg)