Vijayawada: జనసేన ఉచిత న్యాయ సలహా కేంద్రం

ప్రజలకు న్యాయపరమైన సలహాలు ఉచితంగా అందించేందుకు జనసేనపార్టీ న్యాయ విభాగం సన్నాహాలు ప్రారంభించింది. అందులో భాగంగా కృష్ణా జిల్లా యూనిట్ గా ఉచిత న్యాయసలహా కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించారు. విజయవాడ కరెన్సీ నగర్ లోని 5వ లైన్ లో ఈ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్టు పార్టీ లీగల్సెల్ చైర్మన్ శ్రీ ఇవన సాంబశివ ప్రతాప్ తెలిపారు. బుధవారం ఉదయం అందుకు సంబంధించిన కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణతో కలసి ప్రారంభించారు. పార్టీ లీగల్సెల్ లో భాగస్వాములుగా ఉన్న న్యాయవాదులు ఈ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని శ్రీ ప్రతాప్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు శ్రీ పోతిన వెంకట మహేష్, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కప్పెర కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిలుకూరి వీర్రాజు, కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.కె. కిరణ్, ఉపాధ్యక్షులు శ్రీ రామరాజు తదితరులు పాల్గొన్నారు.