Nellore: జనసేన ప్రచార హోరు – ప్రతి గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలు
నెల్లూరు 8వ డివిజన్ హరినాథ్ పురం లో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ చెన్నారెడ్డి, నాయకత్వంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నెల్లూరు నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, స్థానిక నాయకులు సిరివెళ్ల నరేష్ యాదవ్ గారు, తదితర నాయకులు కార్యకర్తలు కలిసి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రతి గడపకు జనసేన పార్టీ సిద్ధాంతాలను చేరే విధంగా కార్యాచరణతో గాజుగ్లాస్ గుర్తుని వివరిస్తూ ప్రచారం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-28-at-1.51.33-PM.jpeg)