రవాణా రంగాన్ని ఆదుకోండి

  • జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్తఫా అంబేద్కర్
  • టాక్స్ తగ్గించాలని బోడపాటి శివదత్ డిమాండ్

విజయవాడ, రవాణా రంగం కుదేలు, రాష్ట్రా ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచిన టాక్స్ వెంటనే తగ్గించాలని జై ఇండియన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముస్తఫా అంబేద్కర్ అధ్వర్యంలో జరిగిన మీడియా సమవేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివ దత్ మాట్లాడుతూ ట్రాన్స్ పోర్ట్ రంగంలో ప్రభుత్వం టాక్స్ రూపంలో అత్యధికంగా భారం మోపి లారీ ఓనర్స్ ఆత్మహత్యలకు పాల్పడే స్థితికి ప్రభుత్వం దిగజారిందని ఆవేదన వ్యక్త పరిచారు. వెంటనే టాక్స్ ను తగ్గించాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ఇతర రాష్ట్ర ల నుండి ట్రాన్స్ పోర్ట్ ద్వారా ధాన్యం తీసుకురావడానికి అనుమతులు ఇవ్వాలని, ఆంధ్ర తెలంగాణా సింగిల్ పర్మిట్ జిఓ ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మద్దిపాడు ఏ. వినాయక రాజు, టంగుటూరు ఏవి నరసరాజు, ఏలూరు వెంకట కృష్ణారావు, యూనియన్ మెంబర్ బాబు తదితరులు పాల్గొన్నారు.