కరోనా టెస్టుల ధరలను తగ్గించిన జగన్ ప్రభుత్వం

కరోనా టెస్టుల ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా టెస్ట్ ధరలను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రభుత్వం పంపిన శాంపిల్స్ టెస్ట్‌కు రూ. 2,400 ఉన్న ధరను ఇప్పుడు 1600 రూపాయలకు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేట్‌గా ల్యాబ్స్‌లో టెస్ట్ కోసం గతంలో నిర్దేశించిన రూ. 2900 రూపాయల ధరను 1900 తగ్గిస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టెస్ట్ కిట్లు పెద్ద ఎత్తున అందుబాటులోకీ రావటంతో కిట్లు ధర తగ్గిందని ప్రభుత్వం వెల్లడించింది. తగ్గిన ధరల ద్వారా వచ్చే ప్రయోజనాలను ప్రజలకు అందించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది.