కోవిడ్ విధుల్లో సేలందిస్తూ కరోనాతో మృతి చెందితే..వారి కుటుంబoలో ఒకరికి 30 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం

కరోనా కష్టసమయంలో కొన్ని ప్రభుత్వశాఖలకు సంబంధించిన ఉద్యోగులు సేవలందించే విషయంలో ముందు వరుసలో ఉన్నారు. వారిలో డాక్టర్లు ముందు వరుసలో ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ డాక్టర్ల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ విధుల్లో భాగంగా సేలందిస్తూ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు ఎవరైనా కరోనాతో మృతి చెందితే.. వారి కుటుంబాలను సాధ్యమైనంత తొందరగా ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వారి కుటుంబంలో ఒకరికి 30 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగాల ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.

డాక్టర్ చనిపోయిన ఆస్పత్రి ఉన్న జిల్లాకు సంబంధించిన డీఎంహెచ్‌వో లేదా డీసీహెచ్ఎష్ లేదా బోధనాసుపత్రి అయితే సూపరిండెంట్ వెంటనే వివరాలు పంపించాలని ఆదేశించింది. అలాంటి వారి వివరాలు వచ్చిన వెంటనే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.