నేటి సాయంత్రం శ్రీవారికి పెదశేషవాహన సేవ

తిరుమలలో శ్రీవారికి నేటి సాయంత్రం పెదశేషవాహన సేవ నిర్వహించనున్నారు. నాగుల చవితి సందర్భంగా పెదశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి మలయప్పస్వామి దర్శనమిస్తారు. నేడు కపిలేశ్వరాలయంలో విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తారు.