Nellore: జోరు వానలో జనసేన గొడుగులతో ప్రచారం

నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలను జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గాజు గ్లాసు మొత్తం 39 డివిజన్లలో అభ్యర్ధులను బరిలోకి దించింది. గాజు గ్లాసుకు ఓటు వేద్దాం.. అభివృద్ధికి చోటిద్దాం అనే నినాదంతో అభ్యర్ధులు ఇంటింటికీ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. 36వ డివిజన్ అభ్యర్ధి శ్రీమతి గాదం నవీన, 19వ వార్డు అభ్యర్ధి శ్రీమతి కృష్ణవేణి, 32వ శ్రీ అరవ మస్తాన్ లు ఇప్పటికే ఇంటింటికీ తిరిగి ఓటు అడుగుతున్నారు. నిజాయితీకి పట్టం కట్టాలని, శ్రీ పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరుతున్నారు.

15 డివిజన్ లో జనసేన వినూత్న ప్రచారం
నెల్లూరు నగరంలోని స్థానిక 15 వ డివిజన్ నందు జనసేన అభ్యర్థి పసుపులేటి రజిని, హరికృష్ణ జోరు వర్షం లో వినూత్నంగా గొడుగులతో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు ఈ ప్రచారం డివిజన్ లోని ప్రతి ఓటర్ మహాశయులను ఆకట్టుకుంది అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గంటా స్వరూప, విజయ్ శేఖర్ ఈ వినూత్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అభ్యర్థి సోదరుడు కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో డివిజన్లోని ప్రతి గడపకు జనసేన విజయం కోసం పాటుపడుతున్నారు.