పంజాబ్ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఆప్
వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన దృష్టిని కేంద్రీకరించింది. అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం ప్రకటించింది. పది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. వారి పేర్లను ప్రకటిస్తూ ఒక జాబితాను విడుదల చేసింది.
త్వరలో జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఆప్ స్పష్టం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తగిన సంఖ్యలో సీట్లను ఆప్ గెలుచుకున్నది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధానంగా దృష్టి సారించింది. దీని కోసం ఇప్పటి నుంచే అభ్యర్థులను ఖరారు చేస్తున్నది.
Aam Aadmi Party announces its first list of candidates for 2022 Punjab assembly elections pic.twitter.com/CSGFX9TcPt
— ANI (@ANI) November 12, 2021