Tadipatri: యాడికి మండల జనసైనికుల ఉదారత

తాడిపత్రి నియోజకవర్గంయాడికి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన పండరినాథ్ కుమారుడు రాహుల్ లుకేమియా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగుళూర్ సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దాదాపు 8 లక్షలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో యాడికి మండల జనసైనికులందరూ కలిసి ఐదువేల రూపాయలు సేకరించారు. మండల ఇంచార్జ్ సునీల్ కుమార్ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కదిరి శ్రీకాంత్ రెడ్డి 20000/- సహకారం అందించగా మొత్తం 25000/- వేల రూపాయలను శ్రీకాంత్ రెడ్డి స్వయంగా బెంగళూరు సెయింట్ జాన్స్ హాస్పిటల్ వెళ్లి రాహుల్ తల్లిదండ్రులకు అందజేశారు ఐసియూ వార్డు నందు చికిత్స పొందుతున్న రాహుల్ ని చూసి సంబంధిత డాక్టర్లను అడిగి చికిత్స గురించి తెలుసుకున్నారు. అనంతరం రాహుల్ త్వరలోనే కోలుకుంటాడని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. సహాయం అందండంలో సహకరించిన జనసైనికులందరికి అలాగే శ్రీకాంత్ రెడ్డి కి రాహుల్ కుటుంబసభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.