అణగారిన వర్గాల ఆశాజ్యోతి!పేదల జీవితాల్లో వెలుగులు నింపిన ధీరుడు! అలుపెరుగని యోధుడు జ్యోతిరావు పూలే! బండారు శ్రీనివాస్ జనసేన ఇంచార్జ్!
తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, జనసేన పార్టీ ఇన్చార్జి బండారు శ్రీనివాస్ ఈరోజు మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి నవంబర్ 28, సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నామని తెలియజేశారు.
దేశంలోనే పలు సామాజిక సంస్కరణ ఉద్యమంలో ఒక గొప్ప పోరాట పటిమ గల వ్యక్తి అని, సామాజిక సంస్కరణ ఉద్యమం లో భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి గా పూలే పరిగణించబడతారని, భారతదేశంలో మహిళలు, బాల బాలికలు కూడా నిరక్షరాస్యులుగా ఉండకూడదని, మహిళలు చదువులో ముందుకు రావాలని, పూలే తన భార్య సావిత్రి బాయ్ పూలేను భారతదేశంలో మొట్టమొదట ఉపాధ్యాయురాలిగా చేసి, మహిళలకు, బడుగు బలహీనవర్గాల మహిళలకు విద్యను ప్రసాదించాలని, మంచి ఆలోచనతో కోరుకున్న వ్యక్తి అని, జ్యోతిరావు పూలే దంపతులు భారతజాతికి చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని, ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ కొనియాడారు.