తుఫాను సహాయక చర్యల్లో బొబ్బిలి జనసేన

బొబ్బిలి, జవాద్ తుఫాన్ కారణంగా బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి గిరాడ అప్పలస్వామి ఆధ్వర్యంలో వృద్ధులకు, ఆనారోగ్యంతో వున్నవారికి రగ్గులు పంపిణీ చేశారు. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ, నక్కలవీది, ఆర్టీసీ కాంప్లెక్స్, శివాలయం వీధిలలో వున్న 50 మంది వృద్ధులకు రగ్గులను అందజేశారు. కార్యక్రమంలో జన సైనికులు ఆర్కే నాయుడు, లంక రమేష్, మౌళి, హరి తదితరులు పాల్గొన్నారు.