వరద బాధితులకు అండగా జనసేన గల్ఫ్ కార్మికులు

కడప జిల్లా, నందలూరు మండలంలోని నల్లతిమ్మయ్య నడిగడ్డ ప్రజలు చేయ్యేరు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయారు. వరదల వల్ల నష్టపోయిన ఈ నడిగడ్డ ప్రజలకు జనసేన గల్ఫ్ కార్మికులు అర్థిక సాయంతో దుప్పట్లు, చీరలు, లుంగీలు, బక్కెట్లు, జగ్గులు, దొమ తెరలు జనసేన నాయకులు కొట్టే శ్రీహరి మరియు ప్రశాంత్ అధ్వర్యంలో అందివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సహకరించిన గుంటూరు శంకర్ కు మరియు జనసేన గల్ఫ్ కార్మికులు సభ్యులు మునయ్య, కృష్ణ, షఫి, దుర్గరావు, రాకేష్ నాగ, సూర్య, రేణుక, సతీష్ లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆకుల నర్సయ్య, యెద్దల నరసింహా, సర్దార్ బాలు, నడిగడ్డ జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.