కడప జిల్లా జనసేన విస్తృతస్థాయి సమావేశం

జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర కడప జిల్లాలో నిర్వహిస్తున్న సందర్బంగా గురువారం కడప శ్రీనివాస కళ్యాణ మండపంలో కడప జిల్లా శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.