“విశాఖ ఉక్కు పరిరక్షణ మనందరి బాధ్యత”

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు “విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు” అనే డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ఆళ్లగడ్డ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మైలేరి మల్లయ్య నాయకత్వంలో #Raise_Placards_ANDHRA_MP అనే నినాదంతో కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మైలేరి మల్లయ్య మాట్లాడుతూ, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటికరణ ఉద్యమంలో పార్టీలకతీతంగా పోరాడాలని పార్లమెంట్ సమావేశాల్లో వైసిపి, టిడిపి పార్టీల MP లందరు ప్లకార్డులు ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు, కేంద్రం ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ మీద తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటసుబ్బయ్య, ఆంజనేయులు, నయమత్ ఖాన్, ప్రసాదు, శీను, బడేబాస్ తదితరులు పాల్గొన్నారు.