విజయనగరంలో జనసేన యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ

విజయనగరం, జనసేన పార్టీ ఈ నెల 12న తల పెట్టిన యువశక్తి కార్యక్రమానికి విజయనగరం, నెల్లిమర్ల నియోజకవర్గాలకు యువశక్తి ప్రచారకర్తగా రాష్ట్ర పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ, విజయనగరం ఇంచార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశశ్వినితో ఆదివారం విజయనగరం పట్టణంలో రింగ్ రోడ్డు సెంటర్ లో ఫార్మా కార్మికులతో ఈ నెల 12న జరిగే యువశక్తి భారీ బహిరంగ సభ యొక్క ముఖ్య ఉద్దేశ్యం గురించి వారితో మాట్లాడి వారికి ఉత్తరాంద్ర వెనుక బాటు వలసలపైన ఆయన వారితో మాట్లాడి వారికి యువశక్తి బహిరంగ సభని విజయవంతం చేయాలని పిలుపునిచ్చి వారితో జనసేన తలపెట్టిన యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ చేసారు. అదే విధముగా మరిచర్ల పంచాయితీ స్కూల్ లో విద్యార్థుల నుండి ఉత్తరాంద్ర వెనుకబాటు ఇక్కడ పరిశ్రమలో ఉపాధిపైన విద్యార్థులతో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.