పబ్జీ నిషేధంపై భారత్‌ నిర్ణయాన్నీతప్పుపట్టిన చైనా

చైనాకు చెందిన పబ్జీగేమ్ తో పాటూ 118 యాప్‌లపై భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యం లో భారత్‌ నిర్ణయంపై చైనా మండిపడింది. భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు చైనా పెట్టుబడిదారులు, సర్వీస్ ప్రొవైడర్ల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ అన్నారు. తన తప్పులను భారత్ సరిదిద్దుకోవాలని చెప్పారు. భారత్ చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మరోవైపు, సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.