జనసైనికుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం

గుంటూరు జిల్లా, గురజాల పట్టణానికి చెందిన జనసైనికుడు శ్రీ అన్వర్ ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రెక్కాడితేగాని డొక్కాడని అతని కుటుంబ పరిస్థితిని తెలుసుకుని స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు తమవంతు సాయాన్ని అందచేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ అన్వర్ కుటుంబాన్ని పరామర్శించి రూపాయలు 10 వేల నగదు, నెలకు సరిపడ నిత్యవసర సరకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీ కటికం అంకారావు, శ్రీ ప్రసాద్, శ్రీ అజీజ్, శ్రీ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.