రామకృష్ణ కుటుంబానికి నివాళులర్పించిన గార్లపాడు గ్రామం జనసేన

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ నెమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జీ శ్రీ రామ్ తాళ్లూరి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో పాల్వంచ పట్టణంలో రామకృష్ణ కుటుంబం సభ్యులు మృతికి కారణంగా మధిర నియోజకవర్గం విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ ఆధ్వర్యంలో బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో విద్యార్థులతో కలిసి రామకృష్ణ కుటుంబానికి కొవ్వతులతో నివాళ్లు అర్పించి, కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన ఆధ్వర్యంలో నివాళులు అర్పించటం జరిగింది. ఇందులో బాగంగా మధిర నియోజకవర్గం విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ మాట్లాడుతూ మృతికి కారణంగా భావిస్తున్నా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ్ ను కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ తరుపున నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరిగింది. అంతేకాకుండా రామకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని, మళ్ళీ ప్రజలు ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడకుండా నిందితుడికి కఠిన శిక్షణ అమలు చేయాలని డిమాండ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు గంధం వంశీ కనకపూడి నాగరాజు, మనోజ్, రాకేష్, వేణు, తదితరులు పాల్గొన్నారు.